Sunday, April 28, 2024

India vs Sri Lanka: భారీ స్కోర్ దిశగా భారత్.. సెంచరీ పూర్తి చేసిన జడేజా

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. లంక బౌలర్లపై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చుక్కలు చూపించి సెంచరీ పూర్తి చేశాడు. మొహాలీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు జడేజా తన ఖాతాలో రెండో సెంచరీ(102) రికార్డు వేసేసుకున్నాడు. మొత్తం జట్టులో జడేజానే అత్యధిక స్కోరుతో ముందున్నాడు. జడేజాకు తోడుగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (61) కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో ఆట రెండో రోజు లంచ్ టైమ్ కు భారత్ స్కోరు 450 దాటింది. అయితే, సురంగ లక్మల్ బౌలింగ్ లో అశ్విన్ వికెట్ సమర్పించుకున్నాడు. జడేజా తర్వాత రిషబ్ పంత్ 96 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్ గా ఉన్నాడు. కీలకమైన పంత్, అశ్విన్ వికెట్లను తీసింది లక్మల్ కావడం గమనార్హం.  రెండో రోజు శనివారం మధ్యాహ్నం లంచ్ విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement