Monday, April 29, 2024

కోటిన్నర సొంత నిధులతో స్కూల్​ బిల్డింగ్​.. మంత్రి కేటీఆర్​కు ప్రణాళిక అందజేసిన చల్మెడ..

సిరిసిల్లలో ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలతో పాటు.. టీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో పలువురు వ్యక్తులు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని కోనరావుపేట మండలం మలకపేట గ్రామంలో స్కూల్​ బిల్డింగ్​ నిర్మించడానికి ఓ దాత ముందుకొచ్చారు. కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆధునిక భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు టీఆర్ఎస్ పార్టీ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు.

ఈ మేరకు ఆయన శనివారం మంత్రి కేటీఆర్ ని కలిసి బిల్డింగ్ ప్రణాళికలను అందజేశారు. స్కూల్​ బిల్డింగ్​ నిర్మాణానికి ముందుకొచ్చి.. నిరుపేద విద్యార్థులకు మంచి వసతులు కల్పించే ఆలోచన చేసినందుకు మంత్రి కేటీఆర్​ ఆయనను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement