Sunday, May 5, 2024

Flash: మరో కార్మికుడి ఆచూకి కనుగొన్న రెస్క్యూ టీం

సింగరేణి గని ప్రమాదంలో చిక్కుకున్న మరో కార్మికుడి ఆచూకీని రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం నుండి కార్మికుల  ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బంది కాసేపటి క్రితం బదిలీ కార్మికుడు రవీందర్ ఆచూకీ కనుగొన్నారు. రవీందర్ కు హాని జరగకుండా బొగ్గు శఖలాలను తొలగిస్తున్నారు. మరో గంటలో రవీందర్ ను బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సేఫ్టీ అధికారి జయరాజ్ అండర్ మేనేజర్ చైతన్య తేజ్ తో పాటు తోట శ్రీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో కార్మికుల తో పాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement