Friday, May 3, 2024

Breaking : ఇంట్లో మంట‌లు : ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం

ఓ ఇంట్లో మంట‌లు చెల‌రేగి ఐదుగురు స‌జీవ ద‌హ‌న‌మైన ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి 8 నెలల బాలుడు సహా ఒకే కుటుంబంలో మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు. దవలపురమ్​, వర్కాల సమీపంలోని చెరున్నియూర్​కు చెందిన ప్రతాపన్​ ఇల్లు రాహుల్​ నివాస్​లో సోమవారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

ఇంటి ముందు పార్క్​ చేసిన ఐదు ద్విచక్రవాహనాలు సైతం కాలిబూడిదయ్యాయి. ఈ ప్ర‌మాదంలో మృతులు ప్రతాపన్​(64), అతని భార్య షెర్లీ(53), చిన్న కుమారుడు అఖిల్​(25), పెద్ద కూమారుడి భార్య అభిరామి(24), అతని 8 నెలల కుమారుడు రయాన్​గా గుర్తించారు. తీవ్ర గాయాలైన ప్రతాపన్​ పెద్ద కుమారుడు నిఖిల్​ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో చెలరేగుతున్న మంటలు, పొగను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement