Sunday, April 28, 2024

సౌదీ అరేబియాలో రోడ్డు ప్ర‌మాదం .. దుర్మ‌ర‌ణం పాలైన కేర‌ళకి చెందిన కుటుంబం ..

సౌదీ అరేబియాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కేర‌ళ‌కు చెందిన మ‌హ్మ‌ద్ జ‌బీర్ ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌లో జ‌బీర్, ఆయ‌న భార్య ష‌బ్నం, వారి పిల్ల‌లు లైబా, లుఫ్తీ, సాహా దుర్మ‌ర‌ణం చెందారు.
ఆయన స్వస్థలం కేర‌ళ‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం వారి మృతదేహాలను భారత్ కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జబీర్ స్వస్థలం కేరళలోని కోజికోడ్ జిల్లా బైపోర్ ప్రాంతం.

జబీర్ కొంతకాలంగా సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి బదిలీ కావడంతో కుటుంబం సహా పయనమయ్యాడు. సామాన్లు ఓ ట్రక్ లో పంపించిన జబీర్, కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. అయితే, నిర్దేశిత గమ్యస్థానానికి లగేజి ట్రక్కు ముందుగా చేరుకుంది. జబీర్ కుటుంబం ఎంతకీ రాకపోవడంతో వారు ఆయన బంధువులకు సమాచారం అందించారు. జబీర్ బంధువులు ఇతర ఎన్నారైలను అప్రమత్తం చేయగా, అసలు విషయం తెలిసింది. జబీర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బిషా అనే ప్రాంతం వద్ద మరో వాహనాన్ని ఢీకొట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement