Monday, April 29, 2024

కాళేశ్వరం జలాలతో నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలం.. కేసీఆర్

కాళేశ్వరం జలాలతో నిజామాబాద్ జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. దళితులకు రూ.10లక్షలు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో రూ.200 పెన్షన్ ఇస్తే… ఇప్పుడు రూ.2వేలు ఇస్తున్నామన్నారు. బోరుకో మీటర్ పెట్టాలని నరేంద్ర మోడీ అంటున్నారన్నారు. రైతుల భూములను లాక్కొని మోడీ తన దోస్తులకు ఇవ్వాలని చూస్తున్నారన్నారు. చాలా పెద్ద కుట్ర చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement