Thursday, April 25, 2024

Breaking: సంబురంగా ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరైన రాజమౌళి

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి-కొరటాల శివ కాబోలో వస్తున్న ఇవ్వాల (శ‌నివారం) ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటోంది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ బెటాలియన్ మైదానంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ‌, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేశారు. కార్యక్రమానికి హాజరైన వారిలో నిర్మాతలు దానయ్య, ప్రసాద్, సినీ రచయిత బీవీఎస్ రవి, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తదితరులు ఉన్నారు. ఆహా వారి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సింగ‌ర్స్ పాడిన పాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement