Friday, April 26, 2024

క‌మ‌ల్ హాస‌న్ తో సాయిప‌ల్ల‌వి – వైర‌ల్ గా ఫొటోస్

హీరోయిన్ సాయిప‌ల్ల‌వి .. విశ్వ న‌టుడు కమల్ హాసన్ ని క‌లిసింది. కాగా క‌మ‌ల్ హాస‌న్ సినిమాల్లో నటిస్తూనే వీలు చిక్కినప్పుడు తన సొంత‌ ప్రొడక్షన్ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా అరుదైన కలయిక జరిగింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న 21వ చిత్రం రాజ్ కుమార్ పెరియన్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ చిత్రాన్ని కమల్ హసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్ కి జోడిగా సాయి పల్లవిని ఎంపిక చేశారు. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లెజండ‌రీ న‌టుడిని సాయి పల్లవి కలిసింది. కమల్ హాసన్ సర్ ని కలవడం వల్ల ఉత్తమ నటిగా మారే మెళుకువలు నేర్చుకున్నాను. అలాగే మంచి వ్యక్తిగా మారే అంశాలు కూడా ఆయన నుంచి తెలుసుకున్నాన‌ని ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement