Friday, March 29, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కమ్మర్ పల్లి ఎస్ఐ ఎం.రాజశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన జాడి కిష్టయ్య (36), జాడి రజిత (33), జాడి రాఘవి (12), జాడి శరణ్య (08) సంవత్సరాలు ఒకే కుటుంబానికి చెందిన వీరు సి.టి – 100 ద్విచక్ర వాహనంపై కమ్మర్ పల్లి నుంచి ఆర్మూర్ వైపు ప్రయాణిస్తుండగా మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కిష్టయ్య, రజిత, రాఘవి ల తలలకు తీవ్ర గాయాలు కాగా కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రజిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్.ఐ రాజశేఖర్ తెలిపారు. రాఘవి ని మోర్తాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో శరణ్య కుడికాలికి తీవ్ర గాయమైంద‌ని, ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మృతురాలి తమ్ముడు దుర్గం మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement