Saturday, May 4, 2024

బుర‌ఖాలో సాయిప‌ల్ల‌వి – ఎందుకో తెలుసా

హీరోయిన్ సాయిప‌ల్ల‌వి తాను న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రానికి రెస్పాన్స్ ఎంత వుందోచూడాల‌ని ఓ సాహ‌సం చేసింది. హైద‌రాబాద్ లోని శ్రీరాములు థియేట‌ర్స్ కి ఆమె బుర‌ఖా ధ‌రించి వెళ్ళి సినిమా మొత్తాన్ని చూసింది. అయితే బుర‌ఖాలో ఉన్న సాయిప‌ల్ల‌విని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు. కాగా ఆమె థియేట‌ర్ నుండి బ‌య‌టికి వ‌స్తుండ‌గా ఓ రిపోర్ట‌ర్ సినిమా ఎలా ఉంద‌ని అడ‌గ‌గా సాయి ప‌ల్ల‌వి స‌మాధానం చెప్ప‌కుండా వెళ్లిపోయింది. హాలు నుండి బయటికి వచ్చాక కారులో ఎక్కే ముందు సాయి పల్లవి తన ఐడెంటిటీ రివీల్ చేశారు.

బురఖాలో ఉంది సాయి పల్లవి అని అప్పుడు అక్కడ ఉన్న ప్రేక్షకులు తెలుసుకున్నారు.బహిరంగ ప్రదేశాలలో హీరోయిన్స్ తిరగడం సేఫ్టీ కాదు. అభిమానులు చుట్టుముట్టి ఫోటోల పేరుతో ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది. పొరపాటున ఎవరైనా సాయి పల్లవిని గుర్తు పడితే పరిస్థితి ఊహించడమే కష్టం. ఆమెతో పాటు సెక్యూరిటీ కూడలి లేదు. ఓ వ్యక్తితో పాటు ఆమె థియేటర్ కి వెళ్ళారు. ఈ వీడియో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు ఆమె యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. విషయం తెలుసుకున్నాక సాయి పల్లవితో ఫోటో ఛాన్స్ మిస్ అయ్యామని కొందరు ఫీల్ అవుతున్నారు. అయితే ఇదంతా మూవీ ప్రమోషన్స్ లో భాగమేన‌ట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement