Friday, April 26, 2024

వెంటిలేటర్ పై సాయి ధరమ్ చికిత్స.. వైద్యులు ఏమన్నారంటే..

రోడ్డు ప్రమాదానికి గురైన టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సాయిధరమ్ తల, ఛాతి, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని స్పష్టం చేశారు. అయితే 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని తెలిపారు.  బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉందని.. అందుకే 48 గంటల పాటు ఆయనను క్లోజ్‌గా మానిటర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆయనకు ఎలాంటి సర్జరీ చేయబోమని వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం దగ్గర ఉన్న ఆస్పత్రిలో వైద్యం అందించారని.. ఆ తరువాత మెరుగైన ఆస్పత్రి కోసం ఇక్కడికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. సాయిధరమ్ తేజ్ ఇక్కడకు వస్తున్నారని సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ ఆయనకు అందించాల్సిన వైద్య సేవలపై డాక్టర్లు సిద్ధమయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారని, ఆయన కోలుకోవాలని అంతా కోరుకుందామని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండిః సాయిధరమ్‌తేజ్ రోడ్డుప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement