Tuesday, April 23, 2024

నేడు బీజేపీ పదాధికారులతో బండి సమావేశం

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర  14వ రోజు చేరింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట నుంచి మెదక్ జిల్లా చిలప్‎చెడ్ మండలం చిట్కుల్ వరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు జోగిపేటలో బండి సజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజా సింగ్,  రఘునందన్ రావు, డికే అరుణ, ఎంపీ అర్వింద్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నెల 17న నిర్మల్‌లో తలపెట్టిన అమిత్ షా బహిరంగ సభ, హుజురాబాద్ ఉప ఎన్నిక, పాదయాత్ర, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై  నేతలు చర్చించనున్నారు. 

ఇది కూడా చదవండిః ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement