Saturday, May 4, 2024

శబరి ఎక్స్ ప్రెస్ కి తప్పిన ముప్పు..పట్టాలపై ఇనుపరాడ్డు

శబరి ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది.హైదరాబాద్ నుండి తిరువనంతపురం వెళ్తోన్న ఈ ట్రైన్ కి గుంటూరు వద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. రైలును ఆపిన అనంతరం రైల్వే సిబ్బంది రాడ్డును తొలగించారు. దీంతో రైలు తిరిగి బయలుదేరింది.దుండగులు పొడవైన ఇనుపరాడ్డును పట్టాలపై అడ్డంగా పెట్టి, రైలు వస్తున్నప్పుడు దాని అదురుకు అది కిందికి పడిపోకుండా పట్టాలకు గుడ్డతో కట్టారు. దుండగులు పథకం ప్రకారమే దానిని కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనఖీ చేసుకుంటూ వెళ్లిన అనంతరం వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement