Friday, April 26, 2024

Telagnana | బస్సులోనే ఉరేసుకున్న ఆర్టీసీ కండక్టర్​.. ఆత్మహత్యకు కారణమేంటో?

బస్సులోనే ఆర్టీసీ కండక్టర్​ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబుబాబాద్​ జిల్లా తొర్రూరులో ఇవ్వాల (ఆదివారం) జరిగింది. తొర్రురూ మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్లో కలకలం రేపింది. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్​రెడ్డి ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చాడు. సెక్యూరిటీ రిజిస్ట్రర్​లో సంతకంపెట్టి డిపోలోకి వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి పరీశిలించగా.. బస్సులో విగతజీవిగా కనిపించాడు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో డిపో అధికారులు కండక్టర్​ ఆత్మహత్య విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్​రెడ్డి ఎందుకు సూసైడ్​ చేసుకున్నాడు. అనే విషయమ్మీద ఇంకా క్లారిటీ రాలేదు. వ్యక్తిగత కారణాలా? పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయమ్మీద పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement