Thursday, April 25, 2024

Delhi | ఢిల్లీ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మితమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం వసంత్ విహార్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్ ఆఫీసు తుది దశ నిర్మాణ పనులను బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా భవన నిర్మాణం పూర్తి కావాలని వారిని అదేశించారు. 2021 సెప్టెంబర్‌లో పార్టీ కేంద్ర కార్యాలయ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అప్పట్నుంచి పార్టీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement