Tuesday, May 21, 2024

ఆర్టీసీ బస్సు – ఆటో ఢీ : బాలుడు మృతి, ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు

నందికొట్కూరు : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామ సమీపంలోని ఆర్టీసీ బస్సు ఆటో ఎదురెదురుగా వస్తూ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పునీత్ రెడ్డి (6) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… కర్నూలులో నివాసముంటున్న‌ నందికుంటకు చెందిన వారు కర్నూలు నుండి పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్నారు. శ్రీశైలం నుంచి కర్నూలు వెళుతున్న బస్సు కర్నూలు నుంచి కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి మహిళలు పింఛన్ తీసుకునేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురెదురుగా బస్సు – ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బాలుడు పునీత్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు మహిళలు ఉమా మహేశ్వరి, ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ ఓబులేష్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన మహిళలను, డ్రైవర్ ను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement