Thursday, April 25, 2024

విజయసాయి బెయిల్ రద్దుకు పిటిషన్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు… తాజాగా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు. రెండు రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని ప్రకటించారు. విదేశాలకు పారిపోయేందుకు ఏ2 చూస్తున్నారని చెప్పారు.

మరోవైపు అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తున్నారని, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రఘురామ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగస్ట్ 25కు వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Tokyo olympics: సెమీస్ లోకి దూసుకెళ్లిన పి.వి సింధు..

Advertisement

తాజా వార్తలు

Advertisement