Wednesday, May 1, 2024

Breaking: రోడ్డుప్ర‌మాదం.. ముగ్గురు టీచ‌ర్లు దుర్మరణం

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు టీచ‌ర్లు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో 11 మంది టీచ‌ర్లు గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌ పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివ‌రాల ప్ర‌కారం.. జ‌లాలాబాద్ నుంచి 14 మంది టీచ‌ర్లు ఓ జీపు ఎక్కారు. వివిధ స్కూళ్ల‌లో ప‌నిచేసే ఆ టీచ‌ర్లు ప్ర‌తిరోజూ జీపులో వెళ్తుంటారు. ఖాయి ఫెమి కే గ్రామం స‌మీపంలో టీచ‌ర్లు ప్ర‌యాణిస్తున్న జీపు.. ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో జీపు డ్రైవ‌ర్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహ‌నాలు బ‌లంగా ఢీకొన‌డం వ‌ల్ల‌.. జీపు విండోల‌ను బ్రేక్ చేసి మ‌రీ మృత‌దేహాల‌ను వెలికితీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement