Wednesday, May 22, 2024

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి

నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద టెంపో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులందరూ తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు శ్రీశైలం నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement