Saturday, May 4, 2024

Flash: క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొట్ట‌న బ‌స్సు, త‌ల్లీ కొడుకులు దుర్మ‌ర‌ణం

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పండుగ వేళ ఈ యాక్సిడెంట్ వారి కుటుంబంలో విషాదం నింపింది. మాన‌కొండూరు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మానకొండూరు గ్రామానికి చెందిన తల్లి, కొడుకు ఇద్దరు అక్కడికక్కడే చ‌నిపోయారు. తండ్రి, కూతురుకి తీవ్ర గాయాల‌య్యాయి. మానకొండూర్ చెరువు కట్ట వద్ద వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి మానకొండూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనగందుల సౌజన్య (28). యశ్వంత్(7) అక్కడికక్కడే చ‌నిపోయారు. అశ్విత(5), ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement