Sunday, May 5, 2024

టీటీడీకి రూ.5.14కోట్ల ఆదాయం – దాత‌ల కోసం మ‌రో కౌంట‌ర్

టీటీడీకి రూ.5.14కోట్ల ఆదాయం వ‌చ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న శ్రీవారిని 66,745 మంది దర్శించుకోగా 30,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీకి రూ. 5.14 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాద భ‌వ‌నంలో దాత‌ల కోసం మరో కౌంట‌ర్‌ను టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. దాత‌లు చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు స‌మ‌ర్పించేందుకు వీలుగా యూనియ‌న్ బ్యాంక్ సౌజ‌న్యంతో ఈ కౌంట‌ర్ ఏర్పాటు చేశారు. భ‌క్తులు వంద రూపాయల నుంచి విరాళాలు అందించ‌వ‌చ్చని ఈవో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement