Thursday, May 2, 2024

ప‌బ్స్ పై ఆంక్ష‌లు – రూల్స్ అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు – సీపీ అంజ‌నీకుమార్

ఇప్ప‌టికే ప‌లు ప‌బ్ ల‌పై పోలీసులు కొర‌డా ఝ‌ళిపించారు. కొత్త సంవ‌త్స‌రం రానున్న నేప‌థ్యంలో ప‌బ్ ల‌లో అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కొన్ని పబ్‌లపై ఫిర్యాదులు అందాయన్నారు. ప‌బ్ ల‌ల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని తెలిపారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి వరకు నడిపే పబ్‌లపై చర్యలు తీసుకొంటామన్నారు.పబ్‌ల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని వెల్ల‌డించారు.తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement