Thursday, April 25, 2024

రేణిగుంట చేరుకున్న అమిత్ షా..స్వాగ‌తం ప‌లికిన జ‌గ‌న్..

ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఆయ‌న‌కి సీఎం జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లికారు.. ఈ సందర్భంగా జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రోజా తది తరులు ఉన్నారు. కాగా అమిత్ షా, జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.అమిత్ షా రాకత నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. అమిత్ షా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి రాగానే నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ శ్రేణులకు అభివాదం చేసిన ఆయన జగన్ తో కలిసి తిరుమల పయనం అయ్యారు. రేపు ఉదయం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమాలలో పాల్గొనన్నారు… మధ్యాహ్నం 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement