Sunday, May 5, 2024

మాయావ‌తికి మాతృవియోగం..

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి తల్లి రామ్రాటి (92) నేడు ఢిల్లీలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్రాటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (హార్ట్ ఫెయిల్యూర్) విడిచారు. ఈ మేరకు బీఎస్పీ ఓ ప్రకటన వెలువరించింది. తల్లి మరణవార్త విని మాయావతి హుటాహుటీన లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మాయావతి తల్లి అంత్యక్రియలు రేపు ఢిల్లీలో నిర్వహించనున్నారు. రామ్రాటి మృతి పట్ల బీఎస్పీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, ఏడాది కిందట మాయావతి తండ్రి ప్రభుదయాళ్ (95) కన్నుమూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement