Thursday, April 25, 2024

Order | జాక్వెలిన్‌కు రిలీఫ్‌.. విదేశాల‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి

మ‌నీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్ కు రిలీఫ్ దొరికింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించగా ఇవ్వాల ఢిల్లీ పాటియాలా కోర్టు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారించిన కోర్టు మే 25 నుంచి జూన్‌ 12 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈ 25 నుంచి 27 వరకు అబుదాబిలో జరిగే ఐఐఎఫ్‌ఏ అవార్డుల వేడుకలకు హాజరుకానున్నట్లు జాక్వెలిన్ కోర్టుకు తెలిపింది. అలాగే 28 నుంచి జూన్‌ 12 వరకు ఇటలీలోని మిలన్‌కు వెళ్లేందుకు అనుమతి కోరగా.. న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.

ఇక‌.. రూ.200కోట్ల కుంభకోణం కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌తో సంబంధాలున్న‌ట్టు జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ అరెస్టు చేయకపోయినా.. గత‌ నవంబర్‌ 15న కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, జాక్వెలిన్‌కు సుఖేష్ చంద్రశేఖర్ రూ.7కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి.

అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఇచ్చాడ‌ని ఈడీ ఆరోపించింది. రాన్‌బాక్సీ మాజీ బాస్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుఖేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన సుకేశ్‌ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement