Friday, April 26, 2024

విమానంలో సాంకేతిక‌లోపం.. అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ .. ఫైల‌ట్ల‌కి గాయాలు

విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ..కర్ణాటకలోని బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయం సమీపంలో రెండు సీట్ల శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ కు చెందిన విమానంలోని ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన సమయంలో వారికి గాయాలు అయ్యాయి. వారిద్దరిని అధికారులు రక్షించారు. చికిత్స నిమిత్తం వెంటనే ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఉన్నట్టుండి వాతావరణం ప్రతికూలంగా మారడంతో అప్రమత్తమైన పైలట్‌లిద్దరూ విమానాన్ని ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో క్రాప్ట్ కి ఎలాంటి నష్టం జరగకుండా వారు జాగ్రత్తపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement