Saturday, April 27, 2024

ఘాటెక్కిన ఎర్ర బంగారం.. మిర్చికి రికార్డు స్థాయి ధర

ఎర్ర బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దేశి రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. 44,000 పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామ రైతు సామినేని నాగేశ్వరరావు 66 బస్తాల ద్వారా దేశి రకం మిర్చిని మార్కెట్‌కు తెచ్చారు. జితిన్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారులు దీనికి ధర రూ. 44 వేలు నిర్ణయించారు. కాగా, మార్కెట్ లో కొద్ది రోజుల క్రితం సింగిల్ పట్టీ రకం మిర్చి ధర క్వింటాల్ రూ. 42,500 పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా రూ. 44,000కి చేరడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement