Sunday, May 5, 2024

రామ‌కృష్ణ‌ది ప‌రువు హ‌త్యే – తేల్చిన పోలీసులు

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి రామ‌కృష్ణ గౌడ్ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన మాజీ
అతడి మృతదేహాన్ని సిద్ధిపేట జిల్లా లక్డారం వద్ద కనుగొన్నారు. ఇది పరువు హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో మొత్తం 11 మంది ఉన్నారని వెల్లడించారు. రామకృష్ణ… గౌరాయిపల్లికి చెందిన భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఈ పెళ్లి భార్గవి తండ్రి వెంకటేశ్వర్లుకు ఇష్టం లేదని భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి వెల్లడించారు. దాంతో లతీఫ్ అనే వ్యక్తిని ఈ హత్యకు పురమాయించాడని తెలిపారు. ఈ నేపథ్యంలో, భువనగిరిలో ఉంటున్న రామకృష్ణ గౌడ్ శుక్రవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదని, దాంతో అతడి భార్య భార్గవి…. లతీఫ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. లతీఫ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, భార్గవి తండ్రి వెంకటేశ్వర్లు ఈ హత్య చేయించినట్టు వెల్లడించాడని ఏసీపీ వివరించారు. ఈ హత్యకు తన భార్యతో పాటు మరో ముగ్గురు సహకరించారని లతీఫ్ చెప్పినట్టు వెల్లడించారు. రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని సిద్ధిపేట జిల్లా లక్డారం వద్ద ఓ కాలువలో పడేసినట్టు తెలిపారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement