Friday, April 26, 2024

కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని.. ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని, ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతమున్న కరెన్సీపై విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో పాటు మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫొటోలను కరెన్సీపై ముద్రించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతుందన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ త్వరలోనే కీలకమైన ముందడుగు వేయవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతమున్న భారతీయ కరెన్సీ, నోట్లలో ఎలాంటి మార్పులు చేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని ఆర్బీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement