Friday, April 26, 2024

Breaking: ఆటో ఎక్కిన యువ‌తిపై అఘాయిత్యం.. హైద‌రాబాద్ జిల్లేల‌గూడ‌లో ఘ‌ట‌న‌..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు కామాంధులు యువతిపై గ్యాంగ్ రేప్ చేసి కలకలం సృష్టించారు. శుక్రవారం సాయంత్రం కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు ఓ యువతి ఆటో ఎక్కింది. ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ మార్గమధ్యలో తన స్నేహితులకు కాల్ చేసి.. జిల్లేల్‌గూడ‌లోని గాయత్రి నగర్‌‌కు తీసుకెళ్లాడు. అక్కడనుంచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ‌ట్టు తెలుస్తోంది. అయితే అతి కష్టమ్మీద‌ వారి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement