Thursday, May 2, 2024

రామకృష్ణ హత్య కేసులో – సూఫారీ గ్యాంగ్ లీడర్ మోత్కూర్ వాసి

యాదాద్రి : భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ హోమ్ గార్డ్ ఎరుకల రామకృష్ణ గౌడ్ పరువు హత్య కేసులో మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన సయ్యద్ లతీఫ్ సూఫారీ గ్యాంగ్ లీడర్ గా రామకృష్ణ హత్య కేసులో కీలకంగా వ్యవహరించడంతో మోత్కూర్ పట్టణ ప్రజలు ,సమీప కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు.మున్సిపల్ కేంద్రంలో పాత బస్ స్టాండ్ సమీపాన నివాసం ఉండే సయ్యద్ ఫక్కీర్ ఆర్టీసీ లో డ్రైవర్ గా రిటైర్డ్ అయ్యారు.ఫక్కీర్ పెద్ద కుమారుడు లతీఫ్ కీ ముస్లిం మహిళతో వివాహం కాగా ,అమ్మనబోల్ గ్రామనికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న లతీఫ్ స్వంత భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో మరో మహిళ తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఆ మహిళతో దశాబ్ద కాలంగా సిద్ధిపేటలో నివాసం ఉంటూ ఈ హత్యకు పాల్పడ్డాడు. తన స్వంత గ్రామమైన మోత్కూర్ కి చెందిన బంధువుల అమ్మాయి ప్రేమ వ్యవహారం లో రామకృష్ణ ను హతమార్చేందుకు రూ.10 లక్షలు సూఫారీ మాట్లడుకోని రామకృష్ణ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్యకు పాల్పడ్డ లతీఫ్ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement