Sunday, May 5, 2024

రామ్ చ‌ర‌ణ్ కోసం గోల్డెన్ టెంపుల్ లో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఉపాస‌న‌

త‌న భ‌ర్త, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కోసం ..ఉపాస‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండటం వ‌ల్ల ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే ప్రత్యేక హక్కు, అవకాశం నాకు లభించింది. రామ్ చరణ్, నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము. వినయంతో అంగీకరిస్తున్నాను” అంటూ గోల్డెన్ టెంపుల్ లోని ప్రత్యేక పూజ విషయాన్ని వెల్లడించింది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కు ముందు రామ్ చరణ్, తారక్, రాజమౌళి అండ్ టీం అంతా గోల్డెన్ టెంపుల్ ని సందర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement