Saturday, May 11, 2024

ప్ర‌ధానిగా రాహుల్ గాంధీ తొలి సంత‌కం, ప్ర‌త్యేక హోదాపైనే – తుల‌సిరెడ్డి

వైసీపీ,టీడీపీ,జ‌న‌సేన‌కు ప్ర‌త్యేక హోదా తెచ్చే శ‌క్తి , ఇచ్చే శ‌క్తి లేద‌ని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అనే అంశం ముగిసిన అధ్యాయ‌న‌మ‌ని , బిజెపి వారిని మోసం చేసింద‌న్నారు. త‌మ‌ పార్టీ మాట మీద నిల‌బ‌డుతుంద‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఆయ‌న చెప్పారు. హోదా కాంగ్రెస్ పేటెంట్, అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం అన్నారు.
ప్రాంతీయ పార్టీలు ఒట్టిమాట‌లు మాత్ర‌మే మాట్లాడ‌తాయ‌ని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఉచ్చులో ప్ర‌జ‌లు ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. 2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని, ఏపీకి ప్రత్యేక హోదా పొందాలని ఆయ‌న అన్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే పెడ‌తార‌ని ఆయ‌న చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement