Sunday, April 28, 2024

క‌డ‌ప జిల్లా సూప‌రింటెండెంట్ వ‌రుణారెడ్డి బ‌దిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు చెందిన జైలు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఒంగోలు జైలర్‌ ప్రకాశ్‌ను కడప జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఏపీ డీజీపీని బదిలీ చేసిన కొద్ది నిమిషాల్లోనే జైలర్ల బదిలీ ఏపీలో చర్చాంశనీయంగా మారింది. అయితే టీడీపీ నాయకుడు చంద్రబాబు కడప జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ వరుణారెడ్డిపై ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో వరుణారెడ్డి బదిలీ జరగడం గమన్హారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement