Sunday, April 28, 2024

రాహుల్ గాంధీకి.. సుప్రీంకోర్టులో ఊరట

కేరళలోని వయనాడ్ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. రాహుల్‌ గాంధీ ఎన్నిక, కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సరితా ఎస్‌ నాయర్‌ 2019 అక్టోబర్‌ 31న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

వయనాడ్, ఎర్నాకులం లోక్‌సభ ఎన్నికలను సవాల్ చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో గతంలో ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, ఈ మేరకు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఇదిలా ఉండగా.. కేరళలో సోలార్‌ స్కామ్‌కు సంబంధించిన రెండు క్రిమినల్‌ కేసుల్లో సరితా ఎస్‌ నాయర్‌ దోషిగా తేలారు. 2019లో వయనాడ్‌, ఎర్నాకులం లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆమె నామినేషన్లు వేయగా.. అధికారులు తిరస్కరించారు. చీటింగ్‌ కేసుల్లో సరిత ఎస్ నాయర్‌ దోషి అని, అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని కేరళ హైకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement