Tuesday, April 30, 2024

శాసన మండలిని రద్దు చేయాలని సీఎం జగన్‌కు రఘురామ లేఖ

గత కొన్నిరోజులుగా సీఎం జగన్‌కు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు మరో లేఖ పంపారు. శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

మండలి కొనసాగించడం వృధా అవుతుందని సీఎం జగన్ చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానని రఘురామ అన్నారు. సీఎం జగన్ విలాసాలకు రూ. 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement