Friday, May 17, 2024

శామీర్‌పేట్‌ చెరువులో దూకి ఇద్దరు వైద్యుల ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు బైక్‌,బ్యాగులు, సెల్‌ఫోన్లు చెరువుగట్టుపై వదిలేయడంతో వాటి ఆధారంగా వీరిని అల్వాల్లోని ఓ హోమియోపతి దవాఖానకు చెందిన వైద్యులుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాల కోసం గజఈతగాళ్ల సాయంతో చెరువులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement