Thursday, May 2, 2024

Radhe Shyam Trailer: అంచనాలు పెంచిన రాధేశ్యామ్.. రెండో ట్రైలర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను మూవీ టీం విడుదల చేసింది. దీంతో సినిమాపై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 1960 నాటి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

https://youtu.be/NqJLkWBPShY
Advertisement

తాజా వార్తలు

Advertisement