Sunday, May 19, 2024

Breaking: తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి అయిన తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బగ్గాపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సన్నీ సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, మతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం వంటి అభియోగాలు బగ్గాపై నమోదయ్యాయి. అంతేకాదు, మార్చి 30న నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బెదిరించారని కూడా సన్నీసింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఆధారాలను పోలీసులకు సమర్పించారు. బగ్గా అరెస్ట్‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన అరెస్ట్ సిగ్గు చేటని విమర్శించింది. పంజాబ్‌లోని తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకుని తన ప్రత్యర్థులను కేజ్రీవాల్ వేధిస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీలోని ప్రతి పౌరుడు తాజిందర్‌కు అండగా నిలుస్తారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కంపూర్ అన్నారు. తాజిందర్ ఇంటికి వచ్చిన 50 మంది పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని మరో నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. తాజిందర్ నిజమైన నాయకుడని, ఇలాంటి చేష్టలతో ఆయనను బెదిరించలేరని తేల్చి చెప్పారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement