Monday, April 29, 2024

అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన- పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్

క‌డుపునొప్పి రావ‌డంతో ఢిల్లీలోని అపోలో హాస్పిట‌ల్ లో జాయిన్ అయ్యారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్. కాగా నేడు ఆయ‌న‌ని హాస్ప‌ట‌ల్ నుండి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. క‌డుపునొప్పి రావ‌డంతో ఆయ‌న్ను బుధ‌వారం హాస్పిట‌ల్‌లో చేర్పించారు. సీఎం భ‌గ‌వంత్ మాన్‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన స‌మ‌యంలో ఆయ‌న భార్య‌, సోద‌రి ప‌క్క‌నే ఉన్నారు. ఉద‌ర సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డిన నేప‌థ్యంలో డాక్ట‌ర్ల బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీఎం భ‌గ‌వంత్‌కు చికిత్స జ‌రిగింది. ఇక బుధవారం అమృత్‌స‌ర్ జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో సింగ‌ర్ సిద్ధూ హ‌త్య కేసులో నిందితుడైన ఇద్ద‌రు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను పోలీసులు చంపేశారు. ఈ నేప‌థ్యంలో పంజాబ్ పోలీసుల‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. ఈనెల 21న డాక్ట‌ర్ గురుప్రీత్ కౌర్‌ను మాన్ పెళ్లాడిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement