Tuesday, April 23, 2024

తిరుమ‌ల‌లో దారుణం.. వ్య‌క్తి దారుణ హ‌త్య‌..

తిరుమలలో ఓ భ‌క్తుడిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. గోవింద నిలయం మ్యూజియం స‌మీప‌లో ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్క‌డే ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించగా నిద్రిస్తున్న అతడిపై బండరాయితో గుర్తు తెలియని వ్యక్తి మోది హత్య చేసిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల‌ను 2 గంటల వ్యవధిలో పట్టుకున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. హత్యకు పాల్పడిన కందస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement