Friday, May 3, 2024

BREAKING: గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. తమిళసైకి మరోసారి అవమానం

తెలంగాణ గవర్నర్ తమిళసై భద్రాచలంలో పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. భద్రాద్రి పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకున్న గవర్నర్ తమిళసై.. సీతారామస్వామిని దర్శించుకున్నారు. అయితే, గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్సీ హాజరుకాలేదు. గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

కాగా, ఇటీవల యాదాద్రి క్షేత్రం పర్యటన సందర్భంగా కూడా ప్రొటో కాల్ వివాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళసై మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వం తనతో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, దీనిపై టీఆర్ఎస్ మంత్రులు సైతం గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement