Monday, April 29, 2024

FLASH: ఢిల్లీలో టిఆర్ఎస్, బిజెపి ఫ్లెక్సీ వార్

తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర తీరును నిరసిస్తూ నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ దీక్ష జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంద. ఈ క్రమంలో ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీల మద్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పెద్దఎత్తున కేసీఆర్ కు వ్యతిరేకంగా బిజెపి ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటు చేశారు. కెసిఆర్ తెలంగాణ రైతులను గాలికి వదిలేసి ఢిల్లీలో డ్రామాలా అంటూ వాటిపై నినాదాలు చేశారు. చేతనైతే ధాన్యం కొనుగోలు చెయ్, లేకపోతే గద్దె దిగు అంటూ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసి ఆగ్రహానికి గురైన టిఆర్ఎస్ కార్యకర్తలు.. బిజెపి ఫ్లెక్సీలను తొలగించి, విసిరి పడేస్తున్నారు. బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement