Saturday, May 4, 2024

జ‌ర్మ‌నీ,యూఏఈలో ప‌ర్య‌టించ‌నున్న – ప్ర‌ధాని మోడీ

ఈ నెల 26,27తేదీల్లో జ‌ర్మ‌నీలో ప‌ర్య‌టించ‌నున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. జర్మనీ పర్యటన అనంతరం ఈ నెల 28న ప్రధాని మోదీ యూఏఈ వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ మృతి పట్ల మోదీ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేయనున్నారు. కాగా స్క్లోస్ ఎల్మావులో జరిగే జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి రావాలంటూ జర్మనీ చాన్సల్ ఓలాఫ్ షోల్జ్ ప్రధాని మోడీ ని ఆహ్వానించారు. ఈ జీ7 సదస్సులో మోడీ రెండు సెషన్లకు హాజరవుతారు. పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్యం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement