Tuesday, May 14, 2024

మెరుగుప‌డుతోన్న ప్ర‌ధాని మోడీ త‌ల్లి ఆరోగ్యం.. ఒక‌టి.. రెండు రోజుల్లో డిశార్జ్

ప్ర‌ధాని మోడీ త‌ల్లి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుప‌డుతోంది. దాంతో ఒకటి రెండు రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. హీరాబెన్ ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఓరల్ డైట్ ప్రారంభించబడింది’’ అని గుజారత్ సీఎంవో ఆఫీసు నుంచి సమాచారం వచ్చింది. హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బుధవారం ఉదయం అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో బుధవారం చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఆమెను సాయంత్రం పరామర్శించారు. దాదాపు గంటన్నర సేపు తన తల్లి, సోదరులతో గడిపిన ప్రధాని.. ఆమె ఆరోగ్య సమస్యలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై వైద్యులతో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement