Wednesday, May 1, 2024

కునో పార్క్ లో 8 చిరుతలను వదిలిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాలో గల కునో పార్క్ లో 8 చిరుతలను ప్రధాని వదిలారు. ఈ చిరుతలు ఆఫ్రికాలోని న‌మీబియా నుంచి తెప్పించారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చిరుతలను గ్వాలియ‌ర్‌కు తీసుకువ‌చ్చారు. గ్వాలియ‌ర్‌లోని ఐఏఎఫ్ విమానాశ్ర‌యంలో ప్ర‌త్యేక విమానంలో చిరుతలకు స్వ‌ల్ప స్థాయిలో మ‌త్తు ఇచ్చి తీసుకువ‌చ్చారు. కాసేప‌టి క్రితం మోడీ ఆ చిరుతల‌ను పార్క్‌లోకి విడుద‌ల చేశారు. ప్ర‌ధాని మోడీ ఇవాళ 72వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చిరుతల‌ను విడుద‌ల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement