Wednesday, May 15, 2024

ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీ కి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోడీ ఆదేశ అధ్యక్షుడిని అడిగి తెలుసుకున్నారు. 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో అందించిన సహకారానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను మోడీ ప్రశంసించారు. సుమీ నుంచి భారతీయుల తరలింపు కోసం మద్దతివ్వాలని జెలెన్ స్కీని ప్రధాని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement