Wednesday, May 1, 2024

Big Breaking : జులై 18న రాష్ట్రపతి ఎన్నిక : సీఈసీ

జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్‌ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్‌ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్‌ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక‍్రటరీ జనరల్‌ వ్యవహరించనున్నారు.

  • ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 29.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2.
  • జూలై 18న పోలింగ్‌,
  • జూలై 21వ తేదీన కౌంటింగ్‌ జరుగనుంది.

ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి. బ్యాలెట్‌ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement