Saturday, May 4, 2024

జిగ‌ర్ తండా ప్రీక్వెల్…

రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ డ్రామా చిత్రం ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’.దీపావళికి తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నా రు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శ కత్వంలో కార్తీకే యన్‌ నిర్మిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ లోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రాంభించారు. 2014లో విడుదలై విజయం పొందిన ‘జిగర్‌ తండా’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ ” ఇంత కు ముందు నా దర్శకత్వంలో రూపొందిన జిగర్‌ తండాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది. ఆ సినిమా సాధించినట్లే ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.
స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ అధినేత కార్తికేయన్‌ సంతానం మాట్లాడుతూ ”జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ సినిమాను ప్రకటించిన రోజు నుంచి అందరిలో తెలియని ఎగ్జయిట్‌మెంట్‌ క్రియేట్‌ అయ్యింది. జిగర్‌ తండాను ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో అలాగే ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ ను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement