Sunday, April 28, 2024

Big Breaking | ప్రముఖ గాయకుడు సాయిచంద్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి..

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, గాయ‌కుడు సాయిచంద్ గుండెపోటుతో చ‌నిపోయారు. బుధ‌వారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చిన సాయిచంద్ అర్ధరాత్రి అస్వస్థకు గురైన‌ట్టు తెలుస్తోంది. కాగా, చికిత్స కోసం నాగర్ కర్నూల్ గాయత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయ‌న‌ చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం. సాయిచంద్ మృతిని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement